హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉన్నదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు వీరిద్దరి హత్య జరిగే ప్రమాదం ఉన్నదని ఆయన శుక్రవారం ఓ ప్రైవేట్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుమానం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే కడపలో వివేకానందరెడ్డి హత్య, విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కోడి కత్తితో దాడి డ్రామా జరిగాయని ఆయన ఆరోపించారు.