జయశంకర్ భూపాలపల్లి : ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన మాజీ మావోయిస్టులను(Former Maoists )జయశంకర్ భూపాలపల్లి పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సురేందర్ రెడ్డి(SP Surendar Reddy) వివరాలను వెల్లడించారు. కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డిని రూ. 50 లక్షల డిమాండ్ చేస్తూ మాజీ మావోయిస్టులు బెదిరించారని ఆయన అన్నారు.
పోలీసులు కాళేశ్వరం చెక్ పోస్టు (Cheak post)వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కారులో అనుమానంగా ఉన్న ఐదుగురిని గుర్తించి అదుపులో తీసుకున్నామని ఆయన వెల్లడించారు. మాజీ మావోయిస్టుల నుంచి కారు, ఒక పల్సర్ బైక్, రెండు డమ్మీ పిస్టోళ్లు(Dummy Pistol), నాలుగు జిలిటెన్ స్టిక్స్, ఐదు మొబైల్ ఫోన్లు, బ్యాగును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.