హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న ఆయనకు సంస్థ సెక్రటరీ అనితా రామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజినీకుమారి, అనితా రాజేంద్ర, ప్రొఫెసర్ ఎన్ యాదయ్య చేత చైర్మన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన 75వ గణతంత్ర వేడుకల్లో పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యులుగా ఎన్నికైన ఎన్ రామ్మెహన్రావు, అమీరుల్లాఖాన్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు.