హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు విసుగొచ్చిన రాష్ట్ర ప్రజలు మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. జగిత్యాల జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజల సంక్షేమంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ ప్రధాన అంశమని తెలిపారు. తెలంగాణకు జీవనాడి ప్రాణహిత జలాలను వాడుకోవడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రానున్న రోజుల్లో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తల కోరిక మేరకే ఉంటుందని అన్నారు.