హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే రేపటి జనరల్ బాడీ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొననున్నారు. ఈ క్రమంలో కుమారస్వామితో పాటు మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వచ్చారు. వీరందరికి బేగంగపేట ఎయిర్పోర్టులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. రేపు ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.