ఆదిలాబాద్ : జిల్లాలో బోథ్ ఫారెస్టు రేంజ్ అధికారి ( FRO) , జూనియర్ అసిస్టెంట్ ( Junior Assistant ) లంచం తీసుకుంటూ ఏసీబీ( ACB ) వలకు చిక్కారు. హరిత హారంలో జాతీయ గ్రామీణ హామీ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన చెక్ డ్యాంలో నీటిని నింపిన బాధితుడికి సుమారు రూ.5లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
ఈ బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగిన బాధితుడు చివరకు బోథ్ ఫారెస్టు రేంజ్ అధికారి టి. ప్రణయ్ రూ. 15 వేల డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు జూనియర్ అసిస్టెంట్ పరుశురాంకు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది. విచారించగా ఎఫ్ఆర్వో ఆదేశాల మేరకు డబ్బు తీసుకున్నట్లు అంగీకరించడంతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.