మహబూబ్నగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోనే తొలిసారి మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవాలయం వద్ద రోప్వే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయమై పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇంజినీర్ల బృందం త్వరలో ఈ అంశంపై నివేదిక ఇవ్వనున్నది. ఇటీవల అంతర్జాతీయ క్రీడల పర్యవేక్షణకుగానూ స్పెయిన్కు వెళ్లిన మంత్రి శ్రీనివాస్గౌడ్ అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న రోప్వేను పరిశీలించి వివరాలు తెలుసుకొన్నారు. కాగా.. టూరిజం శాఖ అధికారులు మన్యంకొండకు రోప్వే సౌకర్యం కల్పించేందుకు అవసరమైన బ్లూప్రింట్ను మంత్రికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అందుకనుగుణంగానే తాజాగా రోప్వే ఏర్పాటుకు మంత్రి ఆమోదముద్ర వేశారు. మంగళవారం నుంచి మన్యంకొండలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.