హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో బుధవా రం వరకు 134.89 లక్షల ఎకరాల్లో (1.34 కోట్ల ఎకరాలు) వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. మరో 74 వేల ఎకరాల్లో సాగు పూర్తయితే ఉమ్మడి ఏపీ చరిత్రను తిరగరాసి అత్యధిక విస్తీర్ణంలో పంటల సాగు రికార్డు నమోదు చేయనున్నది.
2020-21 వానకాలం సీజన్లో రాష్ట్ర చరిత్రలోనే తొ లిసారిగా సాగు విస్తీర్ణం 135.63 లక్షల ఎకరాలుగా నమోదైంది. ఇప్పటికే వరి సాగు కొత్త రి కార్డులు సృష్టించింది. ఈ సీజన్లో బుధవా రం వరకు 63.82 లక్షల ఎకరాల్లో వరి సాగైం ది. గతంలో ఇది 62.12 లక్షల ఎకరాలే అత్యధికం కావడం గమనార్హం. ఈ నెలాఖరు వర కు ఇది మరో లక్ష ఎకరాలకు పెరుగుతుందనే అంచనా ఉన్నది. ఈ సీజన్లో పత్తి 49.79 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 6.20 లక్షల ఎకరాల్లో, కంది 5.58 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.33 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.