హైదరాబాద్ : రాష్ట్రంలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీన రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్ష ప్రిలిమినరీ కీని రేపు విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. రెస్పాన్స్ షీట్లను కూడా రేపు విడుదల చేయనుంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షకు 16,381 మంది దరఖాస్తు చేసుకోగా, 14,830 మంది హాల్టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇందులో 9,535 మంది పరీక్షకు హాజరయ్యారు.