Food poisoning | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కళాశాల్లో ఫుడ్ పాయిజన్(Food poisoning) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఖమ్మం(Khammam) జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ తిని 13 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తిన్న కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
బ్రేక్ ఫాస్ట్ తిని అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్ధులు
ఖమ్మం జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడిన 13 మంది విద్యార్థులు
అస్వస్థతకు గురైన విద్యార్థులను… pic.twitter.com/XvdNAI9U1i
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026