పెద్దపల్లి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లిలోని బాలసదన్లో ఫుడ్పాయిజన్ కారణంగా 32 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సదన్లో చిన్నారులు భోజనం చేసిన తరువాత ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.
సదన్ నిర్వాహకులు వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరికి వైద్య సేవలు అందిస్తున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ కే శ్రీధర్ తెలిపారు. ఇందులో ఐదుగురి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఫ్లూయిడ్స్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. తీసుకున్న ఆహార లోపమా? తాగునీరు కలుషితమా? అనే విషయం తెలియాల్సి ఉన్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని, రాజ్యాంగ సంస్థలు ఒత్తిడిలో పనిచేస్తున్నాయని సీపీఐ జా తీయ నేత కే నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కివేయడంతో పార్లమెంటరీలో చర్చ బలహీనపడుతున్నదని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలు, రా జ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్నదని మండిపడ్డారు.