హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. తూర్పు, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు (Cold waves) వీస్తున్నాయి. దీంతో చలి పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజాము నుంచే పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తెల్లారినప్పటికీ హెడ్లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా ప్రయాణాలకు ఆటంకంకలుగుతున్నది.
కాగా, చలితీవ్రత పెరిగిపోవడంతో సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 9.7 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.