మహదేవపూర్, డిసెంబర్ 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆదివారం బరాజ్ ఇన్ఫ్లో 10,130 క్యూసెక్కులు కాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వరద ప్రవాహం రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 89.20 మీటర్ల ఎత్తులో ఉన్నదని, ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.