హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 812 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో 215 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇప్పుడు 35.8326 టీఎంసీల నీరు ఉన్నది. కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర నదికి వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 10,763 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆర్డీఎస్ ప్రధాన కాలువకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.