శ్రీశైలం : కృష్ణానది ఎగువ ప్రాంతాతమైన కర్ణాటక నుంచి శ్రీశైల జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. సుంకేసుల నుంచి 4,240 క్యూసెక్కుల నీరు విడుదల.. కాగా సోమవారం సాయంత్రానికి 10,200 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 814.60 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 214 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.1402 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.