రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పలువురు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని కొత్తూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొత్తూరు పరిధిలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలసి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తిమ్మాపూర్ పంచాయతీ వార్డు సభ్యులు పాశం కృష్ణ, పాశం మమత అరుణ్ కుమార్, వస్కుల మమత మహేందర్ ఆధ్వర్యంలో వచ్చిన వందలాది మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అకర్షితులై టీఆర్ఎస్లో చేరామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు.
మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకుంటూ కొత్తూరు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డును సంపూర్ణ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్