హైదరాబాద్: మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో, ఫ్లిప్కార్ట్ ఉపాధ్యక్షుడు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో మహిళా సంఘాల వస్తువులతోపాటు ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యం కూడా ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో విక్రయించనుంది.
దీనిద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరగడంతోపాటు వ్యాపార వృద్ధి జరిగి, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తా నియా, సెర్ప్ అధికారులు, ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.