హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ (SERP) అధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్తో ఒప్పందం చేసుకోనుంది. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయం దీనికి వేదిక కానుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్లిప్కార్ట్ ఉపాధ్యక్షుడు రవిచంద్రన్ నేడు ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు.