సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జూన్ 12: సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆదివారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత పేదప్రజల సంక్షేమంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ తీసుకొంటున్న చర్యలను వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అసాధ్యం అనుకొన్న తెలంగాణను పోరాట పటిమతో సుసాధ్యం చేసి స్వ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ జాతీయస్థాయిలో ఏర్పాటుచేసే పార్టీకి విశేష ఆదరణ లభించాలని కోరుతూ మొక్కుకొన్నట్టు తెలిపారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ ప్రధాన భూమిక పోషించాలని ఆకాంక్షించారు.