సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ టౌన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఏడ్చే మగవాళ్లని నమ్మొద్దు.. అని పురాణాలు చెబుతున్నాయి’ అంటూ బండి సంజయ్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలను యూత్ నాయకులు స్థానిక ప్రధాన కూడళ్లు అంబేద్కర్, గాంధీ చౌరస్తాలతో పాటు పాతబస్టాండ్లో ఏర్పాటు చేశారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆ ఫ్లెక్సీని గమనించి, కాసేపు ఆగి చూశారు. కొందరైతే ఆ ఫ్లెక్సీ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.