ఎల్బీనగర్, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ నిరుద్యోగ యువత దిల్సుఖ్నగర్లో శనివారం రాత్రి మెరుపు ర్యాలీ నిర్వహించారు. రెండు లక్షల ఉద్యోగాలు, యువతకు ఉపాధి అవకాశాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున దిల్సుఖ్నగర్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు చేత పట్టుకొని ‘జోహార్ కుమార్స్వామి’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ తీశారు.