హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కేటాయించిన ఐదుగురు అండర్ ట్రైనీ ఐపీఎస్లకు మూడో దశ శిక్షణలో భాగంగా డీజీపీ అంజనీకుమార్ ఎస్హెచ్వోలుగా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒకరోజు వర్క్షాప్లో ట్రైనీ ఐపీఎస్లతో పలువురు సీనీయర్ ఐపీఎస్లు, ఏడీజీలు సమావేశమయ్యారు. అనంతరం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎలతుర్తి పోలీస్స్టేషన్ ఎస్హెచ్వోగా అంకిత్కుమార్ సంఖ్వార్ (ఉత్తరప్రదేశ్), ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మధిర టౌన్ ఎస్హెచ్వోగా అవినాశ్కుమార్ (బీహార్), కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి ఎస్హెచ్వోగా గీతే మహేశ్ బాబాసాహెబ్ (మహారాష్ట్ర), నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయ పరిధిలోని కొండమల్లేపల్లి ఎస్హెచ్వోగా శేషాద్రినిరెడ్డి (తెలంగాణ), రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారం ఎస్హెచ్వోగా శివం ఉపాధ్యాయ (ఉత్తరప్రదేశ్)కు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు ట్రైనీ ఐపీఎస్లు రెండు దశల్లో జరిగిన శిక్షణ, వారి అనుభవాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో ఏడీజీలు శిఖా గోయెల్, విజయ్కుమార్, అభిలాష బిష్త్, ఐజీలు షానవాజ్ ఖాసీం, తరుణ్ జోషి, ఎం రమేశ్రెడ్డి, ఏఐజీ సంప్రీత్సింగ్, టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్ బీ నవీన్కుమార్ పాల్గొన్నారు.