కామారెడ్డి: పోచారం అభయారణ్యంలో వేటగాళ్ల కదలికలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని లింగంపేట మండలం కోమట్పల్లి సమీపంలో జింకలతో వేటగాళ్లు పట్టుబడ్డారు. శనివారం ఉదయం అభయారణ్యంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కార్లలో జింకలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. నిందుతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.