హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ శాఖల సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ‘బాలు గాన సుధాసృ్మతి’ పేరుతో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి గానగంధర్వుడిని స్మరించుకున్నారు. బాలు పాడిన సుమారు 50కి పైగా గీతాలను ఆలపించారు. ఆటా సంస్థకు బాలుకు ఉన్న సంబంధం విడదీయరానిదని నిర్వాహకులు తెలిపారు. 1992లో న్యూయార్క్లో జరిగిన ఆటా రెండో మహాసభలో, 2014లో పెన్సిల్వేనియాలో జరిగిన 13వ ఆటా మహాసభలో బాలు సంగీత విభావరి నిర్వహించారని, 2000లో అట్లాంటాలో జరిగిన ఆరో ఆటా మహాసభల్లో బాలుకు జీవనసాఫల్య పురసారం అందజేసినట్టు గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల, మధు బొమ్మినేని, అరవింద్రెడ్డి, సతీష్రెడ్డి, శారద సింగిరెడ్డి, రామ్ అన్నాడి, సంధ్య గవ్వ, అనంత్రెడ్డి పజ్జూర్, మహేశ్ మానపురి, సుమనసారెడ్డి, మంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.