హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి మొదలుకానున్నాయి. 29 నుంచి సర్వీలు ప్రారంభించాలని సివిల్ ఏవియేషన్శాఖ అనుమతులు జారీచేసింది. స్కూట్ కంపెనీకి చెందిన తొలి విమానం విశాఖపట్నం నుంచి సింగపూర్ బయలుదేరనున్నది. వారానికి మూడుసార్లు సర్వీసు ఉంటుందని కంపెనీ తెలిపింది. విశాఖపట్నంలో రాత్రి 11 గంటలకు బయలుదేరి ఉదయం 5:45 గంటలకు సింగపూర్ చేరుతుంది. వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు. విదేశాలకు చేరుకున్న ప్రయాణికులు ఆయా దేశాల్లో కరోనా నిబంధనలు పాటించాలి. విదేశాల నుంచి విశాఖకు వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ఎయిర్పోర్టులో కొవిడ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.