భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): సకల వసతులతో కొత్తగూడెం వైద్య కళాశాల రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ ఈ కళాశాలను ప్రారంభించనున్నా రు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి.
ఇప్పటికే మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కాలేజీ పరిధిలో మొత్తం 150 సీట్లు ఉండగా జాతీయ కోటా లో 15 శాతం, రాష్ట్రం నుంచి 85 శాతం సీట్లు భర్తీకానున్నాయి. కేరళకు చెందిన శ్రేయా నాయర్ జాతీయ కోటాలో కాలేజీలో తొలి అడ్మిషన్ పొందారు. గురువారం అడ్మిషన్ పత్రాన్ని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆమెకు అందజేశారు.