కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 9: కూకట్పల్లి ఫైర్స్టేషన్లోని ఫైర్ ఆఫీసర్ షేక్ ఫరీద్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికాడు. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నాలుగేండ్లుగా దీపావళి పటాకుల షాపును తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా తాత్కాలిక ఫైర్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు.
ఈ విషయమై జేఎన్టీయూహెచ్లో కొనసాగుతున్న కూకట్పల్లి ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్ షేక్ ఫరీద్ను కలువగా, లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ఉదయం కూకట్పల్లి స్టేషన్ ఫైర్ ఆఫీస్లో రూ.3500 ఫరీద్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు, అతడి ఇంటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.