Nallamalla Forest | నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అమ్రాబాద్, దోమలపెంట, మున్ననూరు అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసి పడుతుండటంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పేందుకు 70 మంది అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు వ్యాపిస్తున్న వైపు పర్యాటకులను, ఇతరులను వెళ్లనివ్వకుండా పోలీసులు, అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.