పెద్దపల్లి : జిల్లా పరిధిలోని గౌరెడ్డిపేట వద్ద భాగమతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మైసూర్ నుంచి దర్భంగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో రైలును పెద్దపల్లి స్టేషన్కు రప్పించారు అధికారులు. మంటలార్పిన తర్వాత ఇంజిన్ను అధికారులు సరి చేశారు. అనంతరం ఎక్స్ప్రెస్ను పంపించేశారు.