Kazipet | వరంగల్ : కాజీపేట రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యార్డులో నిలిపి ఉంచిన కోచ్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.