Fire accident: సచివాలయం సమీపంలోగల మింట్ కాంపౌండ్లోని ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్లోని పుస్తకాలు, ముద్రణా యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.