పోతంగల్ : తమ గ్రామంలో నాసిరకం ఐస్క్రీమ్ ( Ice cream ) అమ్మితే జరిమానా విధిస్తామని గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ హెచ్చరించారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా ( Nizamabad District) పోతంగల్ హంగర్గ గ్రామానికి ( Hangraga Village) వెళ్లే ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
సర్పంచ్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ బయటి నుంచి వచ్చే తోపుడు బండ్లలో నాణ్యత లేని, రంగు,రసాయనాలు కలిపిన ఐస్క్రీమ్లు అమ్ముతున్నారని వీటి వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని అన్నారు. దీంతో పాటు నాసిరకం చిప్స్ ప్యాకెట్ అమ్మవద్దని, జంక్ఫుడ్స్ నిషిద్దమని తెలిపారు .అనంతరం శివాజీ చౌక్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపి, గ్రామ కార్యదర్శి గంగారాం, భజరంగ్, గోవింద్, ఉమ్మార్,జీవన్ తదితరులు పాల్గొన్నారు.