హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ప్రమాదాల బారిన పడిన వారికి భరోసా కల్పిస్తున్నదని సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం తెలిపింది. ఇటీవల తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన మోత్యూరి గంగయ్య, ఇబ్రహీంపట్నం మండలం డబ్బాకు చెందిన సుద్దాల మల్లయ్య, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన పెరుమాండ్ల మొగిలి కుటుంబాలకు అధికారులు శనివారం రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మోచరాజుపల్లికి చెందిన కోటగిరి సతీశ్ గౌడ్, కేసముద్రం మండలం కలువలకు చెందిన కదిరె ఏకాంతగౌడ్, జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన బుడిగె నర్సయ్య గౌడ్ కుటుంబాలకు రూ.15 వేల చొప్పున చెక్కులను ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ బుర్రా వెంకటేశంగౌడ్కు సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంపునూరి మల్లేశం, ఇతర సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.