హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో బుధవారం మీడియా అ కాడమీ ఆధ్వర్యంలో 104 జర్నలిస్టుల కుటుంబాలకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని చెప్పారు. జర్నలిస్టులు చనిపోతే బాధిత కుటుంబాలకు ప్రభు త్వం భరోసా కల్పిస్తున్నదని, రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని అందిస్తున్నదని కొనియాడారు. మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడు తూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో రూ.42 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. మీడియా అకాడమీ ఆ మొత్తాన్ని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీతో జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఎవరైనా జర్నలిస్టు చనిపోతే కుటుంబానికి రూ.లక్ష సాయంతోపాటు ప్రతినెలా 3 వేల పెన్షన్, పిల్లల ట్యూషన్ ఫీజు కోసం వెయ్యి అందిస్తున్నామని వివరించారు. అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా నిస్సహాయ జర్నలిస్టులకు 50 వేలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 600 మందికి ఆర్థికసాయం అందించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు అకాడమీ ద్వారా రూ.19 కోట్లను జర్నలిస్టుల కోసం వెచ్చించినట్టు వివరించారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం అకాడమీ రూపొందించిన గుర్తింపు కార్డును ఈ సందర్భంగా మంత్రి ఆవిషరించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాలశాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్రెడ్డి, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ మారుతీసాగర్, సమాచార పౌర సంబంధాలశాఖ అదనపు సంచాలకుడు కిశోర్బాబు, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, మేనేజర్ పీసీ వెంకటేశం, జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.