హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అవయవదానం విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తుల నుంచి (కెడవర్) అవయవాలు సేకరించి, ట్రాన్స్ప్లాంట్ చేయడంలో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో ఉన్నదని తెలిపారు.
ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం 2022లో అత్యధిక కెడవర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 194 మంది నుంచి సేకరించిన అవయవాలతో 655 మందికి ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు జరిగాయి. ఒక్కరి అవయవదానం 9 ప్రాణాలు నిలుపుతుంది. అందరూ అవయవదానం చేయండి’ అని మంత్రి ట్వీట్టర్లో పేర్కొన్నారు.