మహబూబ్ నగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి ఒక నామినేషన్ దాఖలు అయినట్లు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రానికి చెందిన సారబాయి కృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు ఉన్నారు.