రంగారెడ్డి : మంచాల మండలం చిత్తాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసాగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. చివరకు అక్కడ్నుంచి నిరంజన్ రెడ్డి వెళ్లిపోవడంతో అభిషేక్ రెడ్డి వర్గీయులు శాంతించారు.