నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా భారతీయ జనతా పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దన్పాల్ సూర్యనారాయణగుప్తా మధ్య తోపులాట జరిగింది. ఎంపీ అరవింద్ వచ్చేదాకా హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించకూడదని సూర్యనారాయణగుప్తా డిమాండ్ చేశాడు.
అయితే యెండల లక్ష్మీనారాయణ.. గుప్తా ప్రతిపాదనను పక్కన పెట్టారు. మనషుల కోసం దేవుడు ఆగడు.. శోభాయాత్రను ప్రారంభించాలని లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకుని, ఇరువురికి సర్దిచెప్పారు. అనంతరం శోభాయాత్ర ముందుకు సాగింది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా బీజేపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు #HanumanJayanti pic.twitter.com/l96xdh53Xc
— Namasthe Telangana (@ntdailyonline) April 16, 2022