హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సారవంతమైన నేలపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని, భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలిగే అపురూప కానుక అదేనని శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బీ నీరజాప్రభాకర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మృత్తిక దినోత్సవాన్ని పురసరించుకొని లిబర్టీ ఫౌండేషన్, ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘అగ్రిఫుడ్ టెక్ 360’ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మోతాదుకు మించి సహజ వనరుల వాడకం, పారిశ్రామికీకరణ, యాంత్రీకరణ పర్యావరణ క్షీణతకు కారణం అవుతున్నట్టు చెప్పారు. సదస్సులో నాగార్జున గ్రూప్ చైర్మన్ కేఎస్ రాజు, అగ్రి ఫుడ్టెక్, రూరల్ ఇంపాక్ట్, మెంటార్ డాక్టర్ రవిశంకర్, కోరమాండల్ ఫర్టిలైజర్ వైస్ ప్రెసిడెంట్ జీవీ సుబ్బారెడ్డి ప్రసంగించారు.