హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): సివిల్స్లో 541 ర్యాంక్ సాధించిన డా. పృథ్వినాథ్ గౌడ్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సత్కరించారు. శనివారం రవీంద్రభారతిలో అఖిల భారత గౌడసంఘం ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని సివిల్ ర్యాంకర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ అధ్యక్షుడు వేములయ్య గౌడ్, జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, గౌడ సంఘాల ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్తోపాటు పలు గౌడసంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.