హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ‘యువనిధి’ అంటూ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పా ర్టీ స్టేట్ వర్సిటీల్లో అన్ని రకాల ఫీజులను గణనీయంగా పెంచనున్నది. ఏటా 10 శాతం పెంచనుండగా, ప్రతి రెండేండ్లకు 20-25 శాతం పెంచేందుకు నిర్ణయించింది. స్టేట్ వర్సిటీల్లో ఫీజుల పెంపునకు నియమించిన నిపుణుల కమిటీ సిఫారసులను కర్ణాటక విద్యాశాఖ తాజాగా ఆమోదించింది.
దీని ప్రకారం యూజీ, పీజీ కో ర్సుల్లో అప్లికేషన్, ట్యూషన్, ఎగ్జామ్స్, ఇ న్విజిలేటర్ల రెమ్యునరేషన్లను భారీగా పెంచారు. ఈ ఫీజులను అమలుచేయాలని కర్ణాటక ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ డాక్టర్ వైఎస్ సిద్దేగౌడ రాష్ట్రంలోని 32 యూనివర్సిటీలకు సూచించారు. దీనిపై బీఆర్ఎస్ యవనేత క్రిశాంక్ సోషల్ మీడియాలో స్పందించారు. యువనిధి గ్యారెంటీ పథకాన్ని గుర్తుచేసిన ఆ యన ‘మీ జేబులో నుంచి 10 తీసుకుని, ఒకటి ఇవ్వడమేనా? యువనిధి’ అని కర్ణాటక యువతను ప్రశ్నించారు. మురుగునీటి శుద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాం