హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అరవింద్ హద్దు మీరు ప్రవర్తిస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ఎంపీగా గెలిచి నాలుగేండ్లు అయినా నిజామాబాద్ ప్రజలకు అరవింద్ చేసిందేమి లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెచ్చిన బీమా పథకంపై మాట్లాడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ఉన్మాదానికి ప్రతీకలని విమర్శించారు. అరవింద్ను రాబోయే రోజుల్లో ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారని హెచ్చరించారు.