మృతుల్లో తండ్రి, కొడుకు, మనుమడు
నర్సంపేట రూరల్, మార్చి13: ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మండలం చిన్నగురిజాలకు చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి రంగాపురం శివారులో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనకు కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. కొడుకు నాగరాజుకు భార్యా ఇద్దరు కొడుకులు (కవలలు) ఉన్నారు. నాగరాజు ఊరూరా తిరుగుతూ బట్టల వ్యాపారం చేయడంతోపాటు తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చూసుకొంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కృష్ణమూర్తి దంపతులతోపాటు నాగరాజు (34), కోడలు సంధ్య, మనవళ్లు దీపక్ అలీయాస్ లక్కీ (11), కార్తీక్ రంగాపురంలోని పొలం వద్దకు వెళ్లి మక్కజొన్నను బస్తాల్లో నింపారు. అనంతరం చేతులు కడుక్కోవడానికి తాత నాగరాజు, మనువడు దీపక్ పక్కనే ఉన్న రాళ్లకుంటలోకి దిగారు. ప్రమాదవశాత్తు మనువడు నీటిలో మునిగిపోతుండగా రక్షించబోయి కృష్ణమూర్తి కూడా నీళ్లలోకి జారాడు. వారిని కాపాడేందుకు నాగరాజు నీటిలోకి దిగగా.. ముగ్గురూ మునిగిపోయి మృతిచెందారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అక్కడికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.