నాంపల్లి కోర్టులు, జూన్ 6 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తండ్రి కోస్గి మైబయ్య, కొడుకు కోస్గి వెంకట జనార్దన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. 50 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ ఈశ్వరయ్య బెయిల్ మంజూరు చేశారు.
వారంలో మూడు రోజులు సిట్ కార్యాలయంలో హాజరుకావాలని, పాస్పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. అన్నదమ్ములు రవికుమార్, భగవంత్కుమార్తోపాటు పూల రవికిశోర్, ధనావత్ భరత్నాయక్, పశికంటి రోహిత్కుమార్, గాదే సాయిమధు తరఫున వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరో ఐదుగురి తరఫున వాదనలపై బుధవారానికి వాయిదా వేశారు. మరో ఇద్దరి పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.