అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు మహబూబ్నగర్ నుంచి శ్రీశైలంకు వెళ్తుండగా ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం వద్ద ఒక్కసారిగా బస్సు ఆదుపుతప్పింది. బస్సు గోడలను ,రేయిలింగ్ను ఢీ కొట్టి నిలిచిపోయింది. రేయిలింగ్ లేనిపక్షంలో బస్సు లోయలో పడేదని ప్రయాణికులు తెలిపారు.
ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనను చూసి తీవ్రంగా భయాందోళనకు గురైన ప్రయాణికులు తమను శ్రీశైలం మల్లన్న కాపాడారని భక్తులు పేర్కొన్నారు. అనంతరం ప్రయాణికులను ఇతర బస్సులో తరలించారు. ఘటన వివరాలను డ్రైవర్ నుంచి ఆర్టీసీ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డుపై అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం pic.twitter.com/60bdbhyMvr
— Namasthe Telangana (@ntdailyonline) January 29, 2023