నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ మండలం ముషంపల్లి హత్యాచార ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. గ్రామంలో బుధవారం ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై లైంగిక దాడి జరిపి.. ఆపై హత్యకు పాల్పడటాన్ని ప్రభు త్వం తీవ్రంగా పరిగణించింది. పూర్తి సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేసి సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ కేసు లో నిందితులైన బక్కతట్ల లింగయ్య, ఏర్పుజెల్ల శంకర్ అలియాస్ పుల్లయ్యను 24గంటల్లోనే అరె స్టు చేశారు. ఎస్పీ రంగనాథ్ ముషంపల్లి గ్రామాన్ని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. నిందితులిద్దరూ పాత నేరస్థులని చెప్పారు. వీరి వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమైన నాటినుంచి గ్రామంలోనే జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసలయ్యారన్నా రు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. ముషంపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షపడేలా చర్యలు చేపడతామన్నారు.
ముషంపల్లి ఘటన అమానుషమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయ న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులతో కలిసి నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు వెళ్లి మహిళ మృతదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులకు ఆరు నెలల్లోపే శిక్షపడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.