హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట్: ప్రాణం పోయినా తమ భూములు వదులుకునేది లేదంటూ నాదర్గుల్ రైతులు తేల్చిచెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ మంత్రి మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమను పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు, ప్రైవేట్ సైన్యం అడ్డుకోవడంతో కంచె ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం వంటావార్పు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమిని రైతులకే దక్కేలా ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నారు. ఇందిరాగాంధీ నాడు పేద రైతులు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ఆ భూములను ప్రై వేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం పై ఆందోళన చెందుతున్నారు. ఉదయం గుడికి పోదామన్నా గేటు తీయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గర చిన్న పిల్లలను వదిలేసి పొలం దగ్గర ఉండాల్సి వస్తున్నదని వాపోయారు.
నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూ ములకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రైవే ట్ కంపెనీల కబ్జాకు వత్తాసు పలుకుతూ రైతులను అందులోకి పోనీయకుండా అడ్డుకోవ డంపై నాదర్గుల్ రైతులు మండిపడుతున్నా రు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనను రైతు ఒకరు ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నా రు. రైతుల పోరాటానికి సంఘీభావంగా రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ నేత అజీజ్పాషా ఇటీవల అక్కడికి వచ్చారు. ఒక పోలీసు అధికారి ఆయన వాహనం దగ్గరకు వచ్చి సంభాషించిన వివరాలను రైతులు వెల్లడించారు. ‘ఈ రైతులను నమ్మొద్దు సార్… ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్?’ అని పోలీ సు అధికారి అజీజ్పాషాను ప్రశ్నించారు. స్పందించిన అజీజ్పాషా, పక్కన ఉన్న రైతు లు తమ భూముల కోసం పోరాడుతుంటే ఇలా మాట్లాడటం సమంజసం కాదని మందలించినట్టు చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు భయపెడితే రైతులు ఏం చేస్తారు? అని ఎదురు ప్రశ్నించినట్టు తెలిపారు. ‘రైతులకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన. రైతుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తా. అవసరమైతే చలో అసెంబ్లీ కూడా నిర్వహిస్తా’ అని అజీజ్పాషా అనడంతో పోలీసు అధికారి వ్యూహం బెడిసికొట్టినట్టయ్యింది. కాగా అజీజ్పాషా అక్కడ మీడియాతో మాట్లాడుతూ… రైతులకు సంఘీభావంగా ఇక్కడికి వస్తుంటే తనను అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారని తెలిపారు. దీంతో నాదర్గుల్ భూములపై రైతుల పోరాటాన్ని అడ్డుకునేందుకు పెద్ద శక్తులే పనిచేస్తున్నట్టు అర్థమవుతున్నది.