పెద్దపల్లి : కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడు తున్న అన్నదాతలు నేడు పంటలకు(Crops) నీళ్లు లేక అరిగోస పడుతున్నారు. అప్పులు చేసి పంటలు వేస్తే కండ్లే ముందే ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రోడ్ల మీదికొచ్చి ఆందోళన చేస్తున్నారు.
తాజాగా ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన రైతులు మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ధర్నా(Farmers Dharna) నిర్వహించారు. ధర్నా విరమింప చేయడానికి వచ్చిన సీఐ వెంకటేశ్వర్లు కాళ్లను పట్టుకొని సాగు నీరు ఇప్పించాలని రైతులు వేడుకున్నారు.