ఖమ్మం వ్యవసాయం, జనవరి 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 25వేల బస్తాలు తరలివచ్చింది. రెండురోజులు సెలవుల అనంతరం మార్కెట్లో యాథావిధిగా క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. పంట చేతికి వచ్చే సమయం కావడంతో రైతులు మిర్చిని పెద్దమొత్తంలో తీసుకొచ్చారు. జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్టా రైతులు మిర్చిని తెచ్చారు. జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.16,150, మధ్య ధర రూ.15 వేలు, కనిష్ఠ ధర రూ.12,200 చొప్పున పలికింది.