సిరిసిల్ల : మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల ప్రాంతాల్లోని చెరువులు కాళేశ్వరం జలాలతో నిండు కుండలా మారాయి. దీంతో చెరువుల్లో జళకళ సంతరించుకోవడంతో గ్రామస్థులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రత్యేక చొరవతో కాళేశ్వరం జలాలు(Kaleshwaram water) రంగనాయక సాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువులను నింపారు. దీంతో ఈ చెరువులు పూర్తిగా నిండి, అలుగు పారుతున్నాయి.
ఈ సందర్భంగా పటేల్ చెరువు మత్తడి వద్ద సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో జిల్లెల్ల ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) ఫ్లెక్సీని ప్రదర్శించి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, కాళేశ్వరం జలాలతో తమ గ్రామ చెరువులు నింపుతున్నారని పేర్కొన్నారు. తమ దశాబ్దాల కళ నేరవేరిందని, మండు టెండల్లో చెరువులు నిండాయని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణ పడి ఉంటామని వారు పేర్కొన్నారు.